రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-11-28T05:37:05+05:30 IST
కె.నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్వక్తి మృతి చెందాడు.
గూడూరు, నవంబరు 27: కె.నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్వక్తి మృతి చెందాడు. ఎస్ఐ ప్రేమ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెంచికలపాడు వద్ద ఉన్న పత్తి మిల్లు దగ్గర శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి కోడుమూరు వైపు వెళ్తున్న బైకు ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నాగలాపురం వీఆర్వో రిపోర్టు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచామని, ఆనవాళ్లు తెలిసిన వారు సంప్రదించాలని తెలిపారు. లేత పాచి కలర్ ప్యాంట్, తెలుపు, గోధుమ రంగు గడులు గల గళ్ళ చొక్క ధరించాడని ఎస్ఐ తెలిపారు.