వాటర్ ప్లాంట్ ఆటో తగిలి వృద్ధురాలి మృతి
ABN , First Publish Date - 2020-09-24T08:52:27+05:30 IST
వాటర్ ప్లాంట్ ఆటో తగిలి వృద్ధురాలి మృతి
కళ్యాణదుర్గం టౌన్, సెప్టెంబరు 23: పట్టణంలో మంచినీటిని తరలిస్తున్న ఓ ఆటో తగల డంతో వృద్ధురాలు బండి రామాంజనమ్మ (65) మృతి చెందింది. పట్టణంలోని రాచ్చప్పకుంట కా లనీలో బుధవారం సాయంత్రం మంచినీటిని సరఫరా చేస్తున్న ఆటో డ్రైవర్ ఆటోతీసుకొచ్చాడు.
అయితే హ్యాండ్ బ్రేక్ వేసే క్రమంలో ఆటో సమీపంలో కాలువ గట్టున కూర్చున్న వృద్ధురాలు బండి రామాంజనమ్మపై ఒక్కసారిగా అది ఒక్కసారిగా దూసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్కు కూడా గాయాలయ్యాయని వృద్ధురాలి కుమారుడు బారకాయల కిష్టప్ప తెలిపాడు.
ఆమెను అనంతపురం తరలిస్తుండగా ఒంటిమిద్ది-బోరంపల్లి గ్రామాల మధ్యలో మృతి చెందినట్లు తెలిపాడు. అయితే డ్రైవర్ ఆచూకీ తెలియలేదని చెప్పాడు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని కిష్టప్ప తెలిపాడు.