చంపావతి నదిలో పడి వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2021-04-22T05:01:34+05:30 IST

ఇపురిటిపెంట గ్రామం సమీపాన చంపావతి నదిలో పడి అదే గ్రామానికి చెందిన వృద్ధురాలు నగర సూరిరాములు (60) మృతి చెందినట్టు ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు బుధవారం తెలిపారు.

చంపావతి నదిలో పడి వృద్ధురాలి మృతి
రాములు మృతదేహాన్ని పరిశీలిస్తున్న గజపతినగరం ఎస్‌ఐ

గజపతినగరం : ఇపురిటిపెంట గ్రామం సమీపాన చంపావతి నదిలో పడి అదే గ్రామానికి చెందిన వృద్ధురాలు నగర సూరిరాములు (60) మృతి చెందినట్టు ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు బుధవారం తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం... రాములు బహిర్భూకి వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో జారిపడి మృతి చెందింది. శవపంచనామ నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాములు భర్త గురువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 


రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు...

పాచిపెంట : పాంచాలి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. ఎస్‌ఐ కె.రమణ తెలిపిన వివరాల మేరకు... మండల పరిధి కొటికిపెంట గ్రామానికి చెందిన సారిపల్లి నారాయణ (80) తన కుమారుడు భాస్కర రావుతో కలిసి ద్విచక్ర వాహనంపై సాలూరు పట్టణానికి వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి వస్తుండ గా పాంచాలి గ్రామ సమీపంలో పందులు అడ్డంగా రావడంతో వాటిని తప్పించ బోయి ప్రమాదానికి గురయ్యారు. దీంతో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనంలో తొలుత సాలూరు ఆసుపత్రికి తరలించగా... ప్రాథమిక చికిత్స తర్వాత నారాయణ పరిస్థితి విషమించడంతో విశాఖ రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందారు. భాస్కరరావు మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ద ర్యాప్తు చేస్తున్నారు. కాగా ఘటన జరిగిన ప్రాంతంలో పందుల సంచారం ఎక్కువగా ఉన్నాయని, తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. 


బావిలో దూకి వివాహిత ఆత్మహత్య

కురుపాం : స్థానిక ప్యాలెస్‌ రోడ్‌లో నివాసం ఉంటున్న వివాహిత నారాయణశెట్టి నాగమణి (38) బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ డి.రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... ప్యాలెస్‌ రోడ్‌లో టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న నారాయణ శెట్టి హరికృష్ణ కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండగా... భార్య నాగమణి అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ నేపథ్యంలో నాగమణి తన ఇంటి పెరటిలో గల బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.



Updated Date - 2021-04-22T05:01:34+05:30 IST