బస్సులో నుంచి పడి వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2022-08-16T06:27:05+05:30 IST

కదిరి మండలం కొండమ నాయునిపాళ్యం వద్ద సోమ వారం ఆర్టీసీ బస్సులో నుంచి పడి ఓ వృద్ధుడు మృతి చెం దాడు.

బస్సులో నుంచి పడి వృద్ధుడి మృతి
ఈశ్వర్‌రెడ్డి(ఫైల్‌)


కదిరి అర్బన, ఆగస్టు15: కదిరి మండలం కొండమ నాయునిపాళ్యం వద్ద సోమ వారం ఆర్టీసీ బస్సులో నుంచి పడి ఓ వృద్ధుడు మృతి చెం దాడు. మృతిడి కుమారుడు నరసింహారెడ్డి పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లచెరువు మం డలం బండ్రేపల్లికి చెందిన ఈశ్వర్‌రెడ్డి(70) సోమవారం కదిరి మండలం ఏకాల చెరువుపల్లిలోని తన కుమార్తె ఇంటికి వెళ్తున్నాడు. కొండమనాయునిపాళ్యం వద్ద బస్సులో కండక్టర్‌ సీటు వద్ద నిలబడి ఉన్నాడు. బస్సు మలుపు తిరిగేటప్పుడు పట్టు తప్పి కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఆయనను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలి స్తుండగా మార్గమద్యంలో మృతిచెందాడు, డైవర్‌ నిర్లక్ష్యం వల్లనే తన తండ్రి మృతి చెందినట్లు ఆయన  ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుస్తున్నట్లు సీఐ రియాజ్‌అహమ్మద్‌ తెలిపారు. 


Updated Date - 2022-08-16T06:27:05+05:30 IST