IndiGo Plane Troubles: అస్సాంలో బురదలో కూరుకుపోయిన విమానం
ABN , First Publish Date - 2022-07-29T17:11:56+05:30 IST
అస్సాం (Assam)లోని జోర్హాట్ (Jorhat) విమానాశ్రయంలో
గువాహటి : అస్సాం (Assam)లోని జోర్హాట్ (Jorhat) విమానాశ్రయంలో ఓ విమానం రన్వేపై నుంచి జారిపోయింది. రెండు చక్రాలు బురదలో కూరుకుపోయాయి. దీంతో గురువారం జోర్హాట్ నుంచి పశ్చిమ బెంగాల్లోని కోల్కతా (Kolkata)కు వెళ్లవలసిన ఈ విమానం సర్వీసును రద్దు చేశారు.
ఇండిగో (Indigo) ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఇండిగో 6ఈ-757 విమానం జోర్హాట్ నుంచి బయల్దేరుతుండగా, రన్వేపై జారిపోయింది. రెండు చక్రాలు గడ్డితో కూడిన మైదానంలో కూరుకుపోయాయి. ఈ విమానం కోల్కతా (Kolkata) వెళ్ళవలసి ఉంది.
స్థానిక విలేకరి ఈ దృశ్యాన్ని ట్వీట్ చేశారు. ‘‘గువాహటి-కోల్కతా ఇండిగో విమానం 6ఎఫ్ 757 అస్సాంలోని జోర్హాట్ విమానాశ్రయం రన్వేపై జారిపోయింది, బురద నేలలో కూరుకుపోయింది. ఈ విమానం మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరవలసి ఉంది, కానీ ఈ సంఘటనల వల్ల ఆలస్యమవుతోంది’’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ను ఇండిగోకు ట్యాగ్ చేశారు.
ఇండిగో స్పందిస్తూ, ఈ వార్త వినడం తమకు బాధాకరంగా ఉందని తెలిపింది. సంబంధిత బృందంతో మాట్లాడతామని చెప్పింది. డీఎం ద్వారా పీఎన్ఆర్ను షేర్ చేయాలని కోరింది.
భారత విమానాశ్రయాల సంస్థ (AAI) అధికారులు మాట్లాడుతూ, ఈ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడిందని, గురువారం రాత్రి 8.15 గంటలకు ఈ విమానం సర్వీసును రద్దు చేశారని తెలిపారు. దీనిలో ప్రయాణిస్తున్న 98 మంది ప్రయాణికులు సురక్షితంగా దిగిపోయారని, వారంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు.