అమెరికాలో సూసైడ్ చేసుకున్న భారత సంతతి వ్యక్తి!

ABN , First Publish Date - 2021-01-15T21:25:25+05:30 IST

భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన కూతురు, అత్తలను తుపాకితో కాల్చి, తానూ కాల్చుకుని మరణించిన ఘ

అమెరికాలో సూసైడ్ చేసుకున్న భారత సంతతి వ్యక్తి!

న్యూయార్క్: భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన కూతురు, అత్తలను తుపాకితో కాల్చి, తానూ కాల్చుకుని మరణించిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన భూపేందర్ సింగ్ (57).. తన కుటుంబంతో కలిసి న్యూయార్క్‌లోని షోడాక్ పట్టణంలో నివసిస్తున్నాడు. కాగా.. బుధవారం రోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తన కూతురు జస్లీన్ కౌర్ (14), అత్త మంజీత్ కౌర్‌పై తుపాకీతో దాడి చేసి, తను కూడా కాల్చుకుని మరణించాడు.


ఈ దాడిలో మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 14ఏళ్ల జస్లీన్ కౌర్, మంజీత్ కౌర్‌ ఇద్దరూ తూపాకీతో కాల్చడం వల్లే మరణించినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. గాయపడ్డ మహిళ ప్రస్తుతం అల్బానీ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఆమెకు ప్రాణాపాయం లేదని వెల్లడించారు. ఘటనపై ఆమె నుంచి సమాచారాన్ని సేకరించనున్నట్టు పేర్కొన్నారు. 


Updated Date - 2021-01-15T21:25:25+05:30 IST