వేడుకలకు సన్నద్ధం
ABN , First Publish Date - 2022-08-14T05:15:13+05:30 IST
స్వాతంత్య్ర వేడుకలకు జిల్లా అధికారులు సర్వ సన్నద్ధమవుతున్నారు. పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో మాక్ పరేడ్ నిర్వహించారు.
ఆకట్టుకున్న మాక్ పరేడ్
పార్వతీపురంటౌన్, ఆగస్టు 13 : స్వాతంత్య్ర వేడుకలకు జిల్లా అధికారులు సర్వ సన్నద్ధమవుతున్నారు. పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో మాక్ పరేడ్ నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు చిరుజల్లుల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ సుభాష్ ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన మాక్ డ్రిల్ కూడా అందర్నీ ఆకట్టుకుంది. పరిసర ప్రాంతవాసులు ఆసక్తిగా వాటిని తిలకించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాగా ఏర్పడిన తరువాత తొలిసారిగా పార్వతీపురంలో స్వాతంత్య్ర వేడుకలను నిర్వహిస్తున్నం దున పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వేడుకలకు సంబంధించి నిర్లక్ష్యంగా వహించరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేసీ ఆనంద్, డీఆర్వో వెంకటరావు, డీడీ కిరణ్కుమార్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.