TS News: సికింద్రాబాద్‌లోని ఓ ఇంట్లో పేలుడు

ABN , First Publish Date - 2022-09-03T18:45:05+05:30 IST

నగరంలోని సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్‌లో గల ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. దీంతో ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది.

TS News: సికింద్రాబాద్‌లోని ఓ ఇంట్లో పేలుడు

హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్‌లో గల ఓ ఇంట్లో శనివారం పేలుడు సంభవించింది. దీంతో ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న భార్య, భర్తలు సందీప్, అనులు గాయపడ్డారు. ఇద్దరు నేపాల్ వాసులుగా గుర్తించారు. 20 రోజుల క్రితమే సందీప్, అను హైదరాబాద్ వచ్చారు. ఒక వస్త్ర దుఖానంలో భార్యాభర్తలు పనిచేస్తున్నారు. పేలుడు కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. సిలిండర్ బ్లాస్ట్ కాదని పోలీసులు తేల్చారు. పేలుడుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లూస్ టీం తనిఖీలు చేపట్టింది. పేలుడుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-09-03T18:45:05+05:30 IST