లతా మంగేష్కర్‌‌కు మోదీ నివాళులు

ABN , First Publish Date - 2022-02-06T16:11:52+05:30 IST

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర

లతా మంగేష్కర్‌‌కు మోదీ నివాళులు

న్యూఢిల్లీ : లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశంలో ఎన్నటికీ భర్తీ కానటువంటి శూన్యాన్ని ఆమె వదిలి వెళ్ళారని ఆదివారం ఇచ్చిన ట్వీట్లలో ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాటల్లో వర్ణించలేనంత ఆవేదనకు గురయ్యానని తెలిపారు. ఇతరుల పట్ల దయ, సంరక్షణ భావాలుగల లత దీదీ మనల్ని వదిలి వెళ్ళిపోయారన్నారు. భారతీయ సంస్కృతి దిగ్గజంగా ఆమెను రానున్న తరాలు గుర్తు చేసుకుంటాయన్నారు. ఆమె అద్భుత గళం ప్రజలను సాటిలేని రీతిలో మంత్రముగ్ధులను చేసిందన్నారు. 


ఆమె పాటలు అనేక రకాల భావాలను పలికినట్లు తెలిపారు. భారతీయ సినీ ప్రపంచంలో మార్పులను ఆమె దశాబ్దాలపాటు సన్నిహితంగా చూశారన్నారు. సినిమాలతోపాటు భారత దేశ అభివృద్ధిపట్ల ఆమె నిరంతరం తపించేవారని తెలిపారు. ఆమె ఎల్లప్పుడూ బలమైన, అభివృద్ధి చెందిన భారత దేశాన్ని చూడాలనుకున్నారని చెప్పారు. 


‘‘లత దీదీ నుంచి నేను ఎల్లప్పుడూ అమితమైన ఆప్యాయతను పొందడం నాకు లభించిన గౌరవంగా భావిస్తాను. ఆమెతో నా సంభాషణలు మరపురానివి. లత దీదీ మరణం పట్ల నా తోటి భారతీయులతో కలిసి దుఃఖిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడాను. ప్రగాఢ సంతాపం తెలిపాను. ఓం శాంతి’’ అని పేర్కొన్నారు. 


Updated Date - 2022-02-06T16:11:52+05:30 IST