అమూల్ ఆర్గానిక్ గోధుమ పిండి
ABN , First Publish Date - 2022-05-29T08:43:30+05:30 IST
అమూల్ బ్రాండ్తో ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్న డెయిరీ దిగ్గజం జీసీఎంఎంఎ్ఫ.. ఆర్గానిక్ ఆహారోత్పత్తుల విభాగంలోకి అడుగుపెట్టింది.
న్యూఢిల్లీ:అమూల్ బ్రాండ్తో ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్న డెయిరీ దిగ్గజం జీసీఎంఎంఎ్ఫ.. ఆర్గానిక్ ఆహారోత్పత్తుల విభాగంలోకి అడుగుపెట్టింది. అమూల్ ఆర్గానిక్ హోల్ వీట్ ఆటా పేరుతో గోధుమ పిండిని విడుదల చేయటం ద్వారా ఈ విభాగంలోకి ప్రవేశించినట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (జీసీఎంఎంఎఫ్) ఎండీ ఆర్ఎస్ సోధీ వెల్లడించారు. కాగా త్వరలోనే ఆర్గానిక్ పెసర పప్పు, కంది, శనగ పప్పు ఉత్పత్తులతో పాటు బాస్మతీ బియ్యాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి ఈ గోధుమ పిండి గుజరాత్లోని అన్ని రిటైల్ స్టోర్లలో కేజీ, 5 కేజీల్లో ప్యాక్ల్లో అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేజీ ప్యాక్ ధర రూ.,60గా ఉండగా ఐదు కిలోల ప్యాక్ ధర రూ.290గా ఉంది. ఆ తర్వాత దశలవారీగా మిగతా నగరాల్లో ఆటాను కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది.