అమరావతి మహిళా రైతులపై అత్యంత దారుణంగా వ్యవహరించారు: రఘురామ

ABN , First Publish Date - 2021-08-09T20:36:42+05:30 IST

అమరావతి మహిళా రైతులపై అత్యంత దారుణంగా వ్యవహరించారని ఎంపీ రఘురామకృష్ణరాజు ధ్వజమెత్తారు.

అమరావతి మహిళా రైతులపై అత్యంత దారుణంగా వ్యవహరించారు: రఘురామ

ఢిల్లీ: అమరావతి మహిళా రైతులపై అత్యంత దారుణంగా వ్యవహరించారని ఎంపీ రఘురామకృష్ణరాజు ధ్వజమెత్తారు. మానవ హక్కులకు పోలీస్ స్టేషన్లలోనే భంగం కలుగుతుందని, సుప్రీంకోర్టు చెప్పిన మాట వాస్తవమని గుర్తుచేశారు. తనకే కాదు చాలా మందికి ఇలానే జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. సీబీఐ విచారణలో నిందితులు బిగ్‌బాస్ పేరు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయని, బిగ్‌బాస్ ఏ1 లేక ఏ2 అనేది తెలియాలని, వారిని కూడా విచారించాలని కోరారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా విచారించాలని సీబీఐని కోరుతున్నానని రఘురామకృష్ణరాజు చెప్పారు.




Updated Date - 2021-08-09T20:36:42+05:30 IST