అమరావతిని నాశనం చేశారు!
ABN , First Publish Date - 2021-08-19T16:56:42+05:30 IST
అమరావతిని..
610వ రోజు ఉద్యమంలో రైతుల ధ్వజం
తుళ్లూరు: అమరావతిని నిర్వీర్యం చేయటంతోనే రాష్ట్రానికి తిప్పలు మొదలయ్యాయని రైతులు పేర్కొన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం బుధవారం 610వ రోజుకు చేరుకుంది. అభివృద్ధి చెంది ఆదాయం వచ్చే సమయంలో అమరావతిని సీఎం జగన్రెడ్డి చేతులారా నాశనం చేశారని రైతులు మండి పడ్డారు. ఒక్క కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టటానికి ముం దుకు రావటం లేదంటే ప్రభుత్వం ఆడుతున్న మూడు ముక్కల ఆటే కారణమని స్పష్టం చేశారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, తమది ధర్మ పోరాటమని రైతులు స్పష్టం చేశారు.