అమరావతి రైల్వే లైను గాయబ్‌

ABN , First Publish Date - 2020-09-21T08:33:10+05:30 IST

రాజధాని అమరావతికి నూతన రైల్వే లైను నిర్మాణం ప్రశ్నార్థకం కానుంది. ఆదివారం ప్రభుత్వ హామీల

అమరావతి రైల్వే లైను గాయబ్‌

సర్వే చేయడం అంటే ప్రాజెక్టు మంజూరు చేసినట్లు కాదు

హామీల జాబితా నుంచి తొలగించిన పార్లమెంటరీ కమిటీ 


న్యూఢిల్లీ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి నూతన రైల్వే లైను నిర్మాణం ప్రశ్నార్థకం కానుంది. ఆదివారం ప్రభుత్వ హామీల పార్లమెంటరీ స్థాయీ సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఈ విషయంలో వెల్లడైంది. రాజధానికి రైల్వే కనెక్టివిటీ కల్పించడంలో భాగంగా 2016-17 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం విజయవాడ నుంచి గుంటూరు వయా అమరావతి (67 కిలోమీటర్లు) కొత్త లైనును ప్రకటించింది.


దీనిపై 2016 జూలైలో లోక్‌సభలో వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి ప్రశ్న వేశారు. దీనికి అప్పటి రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా లిఖితపూర్వక సమాధానం ఇస్తూ... ‘‘కొత్త రైల్వే లైనును బడ్జెట్‌లో చేర్చి సర్వే కోసం రూ.7 లక్షలు కేటాయించాము. ఇంకా ప్రాజెక్టును మంజూరు చేయలేదు కాబట్టి పనులు మొదలుకాలేదు’’ అని పేర్కొన్నారు.

అయితే, దీన్ని ఒక హామీగా పరిగణించిన ప్రభుత్వ హామీల పార్లమెంటరీ స్థాయీ సంఘం... ఈ ప్రాజెక్టు పురోగతిపై అధ్యయనం ప్రారంభించింది. కాగా, ఈ ప్రాజెక్టును హామీల జాబితా నుంచి తొలగించాలని కమిటీని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. సర్వే నిర్వహించడం అంటే ప్రాజెక్టును మంజూరు చేస్తామన్నట్లు కాదని, సర్వే  ఆధారంగా ప్రాజెక్టును మంజూరు చేయాలా వద్దా అని నిర్ణయిస్తామని తెలిపింది. అనంతరం ఈ అంశాన్ని కమిటీ తన అధ్యయనం నుంచి తొలగించింది.


Updated Date - 2020-09-21T08:33:10+05:30 IST