తిరుపతిలో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ

ABN , First Publish Date - 2021-12-17T21:26:59+05:30 IST

స్రవిస్తున్న గాయం స్వరం పెంచబోతోంది. దాచుకున్న దుఃఖం బద్దలవబోతోంది. భగభగమండుతున్న గుండెలతో నడిచొచ్చిన రైతు సమూహం పిడికిలెత్తి నినదించబోతోంది.

తిరుపతిలో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ

తిరుపతి: స్రవిస్తున్న గాయం స్వరం పెంచబోతోంది. దాచుకున్న దుఃఖం బద్దలవబోతోంది. భగభగమండుతున్న గుండెలతో నడిచొచ్చిన రైతు సమూహం పిడికిలెత్తి నినదించబోతోంది. రాజధాని పోరాటం అమరావతి దాటబోతోంది. సకలజనావళి ఆమోదంతో శంఖారావం పూరించబోతోంది. పాదయాత్ర ముగింపు తర్వాత మలి అంకం మొదలు కాబోతోంది. నేడు తిరుపతిలో జరుగనున్న అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ ఇందుకు వేదిక అవుతోంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి రైతులు పాదయాత్ర చేశారు. ఈ రోజు పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిరక్షణ మహోద్యమ సభను ఏర్పాటు చేశారు. సభను ప్రత్యక్ష్యంగా మీరు వీక్షించండి.


ఫొటోల కోసం క్లిక్ చేయండి

Updated Date - 2021-12-17T21:26:59+05:30 IST