రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా అమరావతి ఉద్యమం: అమరావతి ఐకాస

ABN , First Publish Date - 2022-02-23T22:42:12+05:30 IST

అమరావతి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చే క్రమంలో

రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా అమరావతి ఉద్యమం: అమరావతి ఐకాస

అమరావతి: అమరావతి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చే క్రమంలో ముందుకెళ్తున్నామని అమరావతి ఐకాస కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు తెలిపారు. మార్చి నెల నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఐకాసల ఏర్పాటు, రౌండ్ టేబుల్ సమావేశాలు చేపడతామన్నారు. శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలిపారు. వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు తమకు మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఉభయ గోదావరి పరిధిలోని ఏలూరు, అమలాపురం రాజమండ్రిలో రౌండ్ టేబుల్ సమావేశాలు పూర్తి చేస్తామన్నారు. 


ఈ నెలాఖరుకల్లా ఉభయగోదావరి జిల్లాల్లో అమరావతి ఐకాసల ఏర్పాటు, రౌండ్ టేబుల్ సమావేశాలు పూర్తి చేస్తామని అమరావతి ఐకాస కన్వీనర్ శివారెడ్డి తెలిపారు. అన్ని పార్లమెంట్ స్థానాల్లో అమరావతి ఐకాసల ఏర్పాటు చేసి, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అమరావతి ఉద్యమం రేపటితో 800వ రోజుకు చేరుతోందన్నారు. 800రోజులుగా భూములిచ్చిన రైతులు రోడ్డున పడి పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-23T22:42:12+05:30 IST