అమరావతి ఉద్యమం @550

ABN , First Publish Date - 2021-06-20T08:51:05+05:30 IST

రాజధానికి భూములిస్తే రైతుల భుక్తిని లాగేసుకోవాలని పాలకులు చూస్తున్నారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు చేస్తున్న ఉద్యమం శనివారంతో 550వ రోజుకు చేరుకుంది

అమరావతి ఉద్యమం @550

తుళ్లూరు, జూన్‌ 19: రాజధానికి భూములిస్తే రైతుల భుక్తిని లాగేసుకోవాలని పాలకులు చూస్తున్నారని రాజధాని  రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు చేస్తున్న ఉద్యమం శనివారంతో 550వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌలు విడుదల చేస్తామని చెప్పి ఐదు రోజులవుతున్నా.. ఇంతవరకు జమ చేయలేదన్నారు. ఎప్పుడైతే మూడు రాజధానులని సీఎం అనారో.. ఆరోజునుంచి ఏఒక్క కంపెనీ, పరిశ్రమ రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురాలేదన్నారు. కాగా, ఉద్యమం 550వ రోజుకు చేరుకున్న సందర్భంగా రాజధాని రైతులు సీఎం ఇల్లు ముట్టడిస్తారని సోషల్‌ మీడియాలో పోస్టులు రావటంతో రాజధాని గ్రామాల్లో శనివారం భారీగా పోలీసులు మోహరించారు. 


అమరావతిదే అంతిమ విజయం: లోకేశ్‌

రైతుల ఉద్యమానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మద్దతు తెలిపారు. ‘‘550రోజులుగా సాగుతున్న మీ శాంతియుత పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా. వెలకట్టలేని త్యాగాలు చేసిన మీవైపు ధర్మం ఉంది. ఆలస్యమైనా న్యాయపోరులో అమరావతిదే అంతిమ విజయం’’ అని ప్రకటించారు.

Updated Date - 2021-06-20T08:51:05+05:30 IST