అమరావతిలో మీకు స్థలాలు కావాలా..? జర్నలిస్టులతో జగన్ వ్యంగ్యంగా..
ABN , First Publish Date - 2020-02-15T07:54:37+05:30 IST
‘అమరావతి లెజిస్లేటివ్ కేపిటల్ కదా..! అక్కడ నేను 70 రోజులు ఉంటా’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఢిల్లీలో శుక్రవారం రాత్రి ఆయన తన అధికార నివాసమైన 1-జన్పథ్ వద్ద
అమరావతి శాసన రాజధాని..
అక్కడ 70 రోజులు ఉంటా
ఢిల్లీ జర్నలిస్టులతో సీఎం జగన్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ‘అమరావతి లెజిస్లేటివ్ కేపిటల్ కదా..! అక్కడ నేను 70 రోజులు ఉంటా’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఢిల్లీలో శుక్రవారం రాత్రి ఆయన తన అధికార నివాసమైన 1-జన్పథ్ వద్ద ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులతో భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఇళ్లస్థలాల కోసం అక్కడ హౌసింగ్ సొసైటీకి రూ.23 వేలు చెల్లించామని.. కానీ ఇళ్ల స్థలాలు రాలేదని.. మీ హయాంలో మంజూరు చేయాలని జర్నలిస్టులు కోరారు. ‘అమరావతిలో మీకు స్థలాలు కావాలా’ అంటూ సీఎం ఒకింత వ్యంగ్యంగా నవ్వుతూ వ్యాఖ్యానించారు. మీరూ అమరావతిలోనే నివాసం ఉంటున్నారు కదా.. అని ఒక విలేకరి అన్నప్పుడు జగన్ పైవిధంగా స్పందించారు. ఇళ్ల స్థలాల కోసం వినతి పత్రం ఇస్తే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.