‘అమరావతి పనులు చేపట్టాలి’

ABN , First Publish Date - 2022-03-17T00:01:08+05:30 IST

భావితరాల భవిష్యత్‌ కోసమే అమరావతి అన్న హైకోర్టు తీర్పుతోనైనా అభివృద్ధి పనులను చేపట్టాలని రైతులు డిమాండ్‌ చేశారు.

‘అమరావతి పనులు చేపట్టాలి’

తుళ్లూరు: భావితరాల భవిష్యత్‌ కోసమే అమరావతి అన్న హైకోర్టు తీర్పుతోనైనా అభివృద్ధి పనులను చేపట్టాలని రైతులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తోన్న ఆందోళనలు బుధవారం నాటికి 820వ రోజుకు చేరుకున్నాయి. పెదపరిమి, తుళ్లూరు, అనంతవరం, నెక్కల్లు, దొండపాడు, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, మందడం, వెంకటపాలెం, ఐనవోలు తదతర గ్రామాల్లోని ధర్నా శిబిరాల నుంచి మహిళలు, రైతులు, రైతు కూలీలు మాట్లాడుతూ అమరావతి అభివృద్ధితో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. కాని సీఎం జగన్‌రెడ్డి ప్రజల, రాష్ట్ర భవిష్యత్‌ గురించి ఆలోచించకుండా అమరావతిని చంపేయాలని చూశారన్నారు. మూడేళ్ల నుంచి మూడు  రాజధానులు అంటూ అమరావతి అభివృద్ధిని నానబెట్టారని విమర్శించారు. హైకోర్టు తీర్పును వైసీపీ ప్రభుత్వం శిరసా వహించి ఇప్పటికైనా అమరావతి పనులు మొదలు పెట్టాలన్నారు.

Updated Date - 2022-03-17T00:01:08+05:30 IST