మాకు చట్టాలు వర్తించవా?
ABN , First Publish Date - 2020-05-29T09:06:38+05:30 IST
‘మేము ఆంధ్రప్రదేశ్లో భాగం కాదా? మాకు చట్టాలు వర్తించవా?..’ అంటూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు రాష్ట్ర ..
163వ రోజు ఆందోళనల్లో
ప్రభుత్వంపై అమరావతి రైతుల ధ్వజం
గుంటూరు, ఆంధ్రజ్యోతి : ‘మేము ఆంధ్రప్రదేశ్లో భాగం కాదా? మాకు చట్టాలు వర్తించవా?..’ అంటూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు గురువారం 163వ రోజుకు చేరాయి. లాక్డౌన్ నిబంధనలను అనుసరిస్తూ, మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తూళ్లురు, మందడం, వెంకటపాలెం, బోరుపాలెం, నీరుకొండ, దొండపాడు, మల్కాపురం, వెలగపూడి, రాయపూడి తదితర 29 గ్రామాల రైతులు, మహిళలు, కూలీలు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. ఆవేదనతో భూములిచ్చిన రైతులు కన్నుమూస్తున్నా.. పట్టించుకోరా అని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సాయంత్రం అమరావతి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలు 37వ రోజుకు చేరుకున్నాయి.