ఏపీ గవర్నర్కు అమరావతి పరిరక్షణ సమితి లేఖ
ABN , First Publish Date - 2020-07-13T15:58:37+05:30 IST
ఏపీ గవర్నర్కు అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి లేఖ రాశారు.
అమరావతి: ఏపీ గవర్నర్కు అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలో పలు కీలకాంశాలను ప్రస్తావించారు. రాజధాని బిల్లులు సెలక్ట్ కమిటీ పరిధిలో ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. రోల్ 237, 238 కింద శాసనమండలి ఆ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపిందని, మండలి కార్యదర్శి దీనిని గుర్తించకుండ మంత్రుల ఒత్తిడితో ఇప్పటికీ సెలక్ట్ కమిటీని ఆచరణలోకి తీసుకురాలేదని అన్నారు. రాజధాని రైతుల హక్కులకు భంగం కలిగించేలా అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారని ఆ లేఖలో శివారెడ్డి పేర్కొన్నారు.