అమరావతి: రాజధాని గ్రామాల్లో రైతు జేఏసీ నిరసనలు
ABN , First Publish Date - 2021-10-08T16:01:00+05:30 IST
అమరావతి: రాజధాని గ్రామాల్లో ట్రెడ్జింగ్, డంపింగ్ ప్రదేశాల్లో రైతులు నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు..
అమరావతి: రాజధాని గ్రామాల్లో ట్రెడ్జింగ్, డంపింగ్ ప్రదేశాల్లో నిరసనలు చేపట్టాలని రైతులకు అమరావతి రైతు జేఏసీ పిలుపు ఇచ్చింది. మందడం గ్రామ పరిధిలో ఇసుక డంపింగ్, ట్రెడ్జింగ్పై హైకోర్టులో రైతు జేఏసీ వ్యాజ్యం దాఖలు చేసింది. అయితే వ్యాజ్యం విచారణలో ఉండగానే కాంట్రాక్టర్ సంస్థ ట్రెడ్జింగ్, డంపింగ్ పనులకు సమాయత్తమవుతోంది. ప్రభుత్వ సహకారంతో ట్రెడ్జింగ్, డంపింగ్ చేసే యోచనలో కాంట్రాక్ట్ సంస్థ ఉన్నట్లు రైతు జేఏసీ నేతలు చెబుతున్నారు. హైకోర్టు తుదితీర్పు వచ్చే వరకు పనులు నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేస్తూ... ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు నిరసనకారులు, మహిళా రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పరిస్థితి ఉద్రిక్తతగా ఉంది.