సింహవాహనంపై అమ్మవారికి ఆలయ ఉత్సవం
ABN , First Publish Date - 2021-04-19T06:10:50+05:30 IST
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిరపురాంతకేశ్వస్వామి, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో ఉగాది వసంత నవరాత్రి ఉత్సవాలలో భా గంగా అమ్మవారు ఆదివారం సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
త్రిపురాంతకం, ఏప్రిల్ 18 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిరపురాంతకేశ్వస్వామి, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో ఉగాది వసంత నవరాత్రి ఉత్సవాలలో భా గంగా అమ్మవారు ఆదివారం సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు విశ్వనారాయణశాస్త్రి, పా లంక ప్రసాదశర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు, బాలబోగం, కాలపూజ, ఉత్సవమూర్తికి అభిషేకం నిర్వహించారు. అనంతరం బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారిని సింహవాహనంపై అలంకరించి ఆలయ ఉత్సవం నిర్వహించారు. అనంతరం పవళింపుసేవ, మంత్రపుష్పం, పరాకులు, ఉభయదాతలకు ఆశీర్వచనం, తీర్థప్రసాదాల వినియోగం చేశారు.