Amith shah : కులం, మతం ఆధారంగా పనిచేయం

ABN , First Publish Date - 2021-08-01T19:39:19+05:30 IST

శాంతి భద్రతల విషయంలో యోగి సర్కార్ సమర్థవంతంగా వ్యవహరిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రశంసించారు.

Amith shah : కులం, మతం ఆధారంగా పనిచేయం

లక్నో : శాంతి భద్రతల విషయంలో యోగి సర్కార్ సమర్థవంతంగా వ్యవహరిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రశంసించారు. బీజేపీ ప్రభుత్వం కులం, మతం, కుటుంబాల ఆధారంగా పరిపాలన చేయదని, పేద ప్రజల కోసమే అహర్నిశలు కృషి చేస్తుందని ఆయన అన్నారు. అమిత్‌షా ఆదివారం యూపీలో పర్యటించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సంస్థకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 నుంచి యూపీ వ్యవహారాలతో టచ్‌లోనే ఉన్నానని, గతంలో యూపీ వాతావరణం ఎలా ఉండేదో తనకు బాగా తెలుసునని పరోక్షంగా సమాజ్‌వాదీ పార్టీపై విమర్శలు చేశారు. యోగి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని అమిత్‌షా అన్నారు.  


Updated Date - 2021-08-01T19:39:19+05:30 IST