హైదరాబాద్లో అమిత్ షా.. తెలుగులో ట్వీట్
ABN , First Publish Date - 2020-11-29T19:25:41+05:30 IST
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలుగులో ట్వీట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం కోసం ఆదివారం హైదరాబాద్కు చేరుకున్న అమిత్ షా తెలంగాణ ప్రజల ఆప్యాయత గురించి తెలుగులో ట్వీట్ చేయడం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలుగులో ట్వీట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం కోసం ఆదివారం హైదరాబాద్కు చేరుకున్న అమిత్ షా తెలంగాణ ప్రజల ఆప్యాయత గురించి తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. ‘‘హైదరాబాద్ చేరుకున్నాను. తెలంగాణ ప్రజల ఆప్యాయతకు మరియు మద్దతుకు ముగ్దుడనైయ్యాను.’’ అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాక మరోసారి తెలుగులోనే ట్వీట్ చేశారు. ‘‘హైదరాబాద్ పర్యటన సందర్భంగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకొని, అమ్మ ఆశీస్సులు అందుకున్నాను. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించాను. భాగ్యలక్ష్మి అమ్మవారు, దేశ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను ప్రసాదిస్తుందని నమ్ముతున్నాను.’’ అంటూ రెండో ట్వీట్లో అమిత్ షా పేర్కొన్నారు. అమ్మవారి దర్శనం అనంతరం అమిత్ షా రోడ్ షోలో పాల్గొని బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు.