అమిత్షా, యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ పర్యటన తేదీలు ఫిక్స్
ABN , First Publish Date - 2020-11-25T18:22:40+05:30 IST
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్ర నేతలు ప్రచారంలో పాల్గొనబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా జేపీ నడ్డా తదితరుల హైదరాబాద్ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఈ క్రమంలోనే రేపు బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ నెల 27న హైదరాబాద్కు యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ రానున్నారు. కాగా.. యోగి పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 28న హైదరాబాద్కు జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, 29న అమిత్ షా రోడ్ షోలలో పాల్గొననున్నారు.