హైదరాబాద్ చేరుకున్న అమిత్‌షా

ABN , First Publish Date - 2020-11-29T17:10:14+05:30 IST

హైదరాబాద్ చేరుకున్న అమిత్‌షా

హైదరాబాద్ చేరుకున్న అమిత్‌షా

సికింద్రాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి భాగ్యలక్ష్మి ఆలయానికి ఆయన బయల్దేరారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అమిత్ షా రాకతో చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఆ తరువాత సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని వారాసిగూడ నుంచి సీతాఫల్‌ మండి హనుమాన్‌ టెంపుల్‌ వరకు అమిత్ షా రోడ్‌ షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ ఆఫీసులో ఉండి సాయంత్రం 5 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. 

Updated Date - 2020-11-29T17:10:14+05:30 IST