సెప్టెంబర్ 17న తెలంగాణకు అమిత్ షా
ABN , First Publish Date - 2021-09-08T00:41:58+05:30 IST
కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన
హైదరాబాద్: కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు అయింది. సెప్టెంబర్ 17న తెలంగాణకు అమిత్ షా రానున్నారు. నిర్మల్ జిల్లాలోని వెయ్యి ఊడల మర్రి వద్ద బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడుతారు. తాను చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బ్రేక్ ఇచ్చి నిర్మల్ జిల్లాలో జరిగే అమిత్ షా బహిరంగ సభలో పాల్గొననున్నారు.