Amith shsh : ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక భేటీ
ABN , First Publish Date - 2021-07-24T16:41:41+05:30 IST
ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్షా కీలక భేటీ నిర్వహించనున్నారు
మేఘాలయ : ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్షా కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఆయా రాష్ట్రాల సీఎస్లు, ఐపీఎస్లు కూడా పాల్గొంటున్నారు. సరిహద్దు సమస్యలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. మేఘాలయ వేదికగా ఈ సమావేశం జరగనుంది. అసోం, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరవుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాంతో అసోం సరిహద్దు సమస్యలను ఎదుర్కొంటోంది. కొన్ని రోజుల క్రితం ఇదే సమస్యపై అసోంలో అల్లర్లు కూడా జరిగాయి. ఈ సమస్యను కూడా అమిత్షా సంబంధిత ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. కేవలం ముఖ్యమంత్రులే కాకుండా, వివిధ పౌర సమాజపు నేతలతో కూడా అమిత్షా భేటీ కానున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి.