కల్యాణ్ సింగ్‌ను పరామర్శించిన అమిత్‌షా

ABN , First Publish Date - 2021-08-02T01:38:26+05:30 IST

తీవ్ర అస్వస్థతతో లక్నోలోని ఎస్‌జీపీజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉత్తరప్రదేశ్ మాజీ..

కల్యాణ్ సింగ్‌ను పరామర్శించిన అమిత్‌షా

లక్నో: తీవ్ర అస్వస్థతతో లక్నోలోని ఎస్‌జీపీజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారంనాడు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అమిత్‌షా వెంట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం ఆసుపత్రికి వెళ్లారు. కల్యాణ్ సింగ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆ వివరాలను అమిత్‌షా అడిగి తెలుకోవడంతో పాటు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను అభినందించారని ఎస్‌జీపీఐ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్‌కే ధిమాన్ తెలిపారు. జూలై 4న కల్యాణ్‌సింగ్‌ను ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్చారు. ప్రధాని మోదీ సైతం ఇటీవల కల్యాణ్‌సింగ్ మనుమడితో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

Updated Date - 2021-08-02T01:38:26+05:30 IST