అమిత్ షాకు కోవిడ్-19 నెగెటివ్ వార్తలు సరికాదు : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

ABN , First Publish Date - 2020-08-09T21:28:06+05:30 IST

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోవిడ్-19 నుంచి కోలుకున్నట్లు బీజేపీ నేత మనోజ్ తివారీ

అమిత్ షాకు కోవిడ్-19 నెగెటివ్ వార్తలు సరికాదు : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోవిడ్-19 నుంచి కోలుకున్నట్లు బీజేపీ నేత మనోజ్ తివారీ ట్వీట్ చేయడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. అమిత్ షాకు ఇప్పటి వరకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించలేదని స్పష్టం చేసింది. 


అమిత్ షా ఆగస్టు 2న కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ కావడంతో మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు కోవిడ్-19 నెగెటివ్ అని నిర్థరణ అయినట్లు బీజేపీ నేత మనోజ్ తివారీ ట్వీట్ చేశారు. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, అమిత్ షాకు కోవిడ్-19 పరీక్షలు ఇంకా జరగలేదని తెలిపింది. 


అమిత్ షాకు మరోసారి కోవిడ్-19 పరీక్షలు జరగలేదని, ధ్రువపడని వర్గాలు ఇచ్చే సమాచారాన్ని వ్యాపింపజేయరాదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. 


ఆగస్టు 2న అమిత్ షా ఇచ్చిన ట్వీట్‌లో తనకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నానని, తనకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయిందని తెలిపారు. 

Updated Date - 2020-08-09T21:28:06+05:30 IST