ఇంటింటికీ అమిత్ షా ప్రచారం.. బీజేపీని గెలిపించాలంటూ కరపత్రాల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-29T00:41:34+05:30 IST

ఇంటింటికీ అమిత్ షా ప్రచారం.. బీజేపీని గెలిపించాలంటూ కరపత్రాల పంపిణీ

ఇంటింటికీ అమిత్ షా ప్రచారం.. బీజేపీని గెలిపించాలంటూ కరపత్రాల పంపిణీ

డెహ్రాడూన్: 2022లో జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. రుద్రప్రయాగ్‌లో అమిత్ షా ప్రచారం చేస్తూ బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు, మరో ఐదేళ్ల పాటు సుపరిపాలన ఉండేలా రాష్ట్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రుద్రనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం తన హయాంలో చేసిన పనులను మరియు పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో ఏమి చేయాలనుకుంటున్నదో జాబితా చూపిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.

Updated Date - 2022-01-29T00:41:34+05:30 IST