దాడిపై MP Arvindకు Amit Shah ఫోన్
ABN , First Publish Date - 2022-07-15T22:19:25+05:30 IST
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. శుక్రవారం ఎర్దండిలో ఎంపీ అర్వింద్ పర్యటించారు.
నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Dharmapuri Arvind)కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఫోన్ చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని పరిశీలించేందుకు వచ్చారు. ఈ సమయంలో కొంతమంది ‘అర్వింద్ గో బ్యాక్’ అని నినాదాలు చేస్తూ ఆయన ఉన్న కారు అద్దాలను పగులగొట్టి అర్వింద్పై దాడికి దిగారు. ఈ దాడిపై కేంద్ర హోంమంత్రి ఆరా తీశారు.
ఈ దాడిపై అర్వింద్ మాట్లాడుతూ.. ‘‘ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగింది, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయి. బీజేపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ దాడులు చేస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎక్కడ తిరిగిన దాడులు జరపాలని టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చింది. దాడి వెనక టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగరరావు ఉన్నారు’’ అని ఎంపీ అర్వింద్ అమిత్ షాకు ఫోన్లో తెలిపారు.