ఏంటిది మిశ్రా.. ఏకి పారేసిన నెటిజన్లు
ABN , First Publish Date - 2021-11-16T01:21:28+05:30 IST
టీమిండియా మాజీ ఆటగాడు, ఢిల్లీ కేపిటల్స్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను నెటిజన్లు
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆటగాడు, ఢిల్లీ కేపిటల్స్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియాకు బదులుగా న్యూజిలాండ్కు అభినందనలు తెలపడమే అతడు చేసిన తప్పు. ‘అద్భుతంగా ఆడారు’ అంటూ న్యూజిలాండ్ జట్టును పొరపాటున ట్యాగ్ చేస్తూ పొగిడేశాడు.
ఇది చూసిన నెటిజన్లు అమిత్ను ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. చేసిన తప్పును తెలుసుకున్న మిశ్రా వెంటనే ఆ ట్వీట్ను డిలీట్ చేసినప్పటికీ అప్పటికే దాని స్క్రీన్షాట్లు సోషల్ మీడియాను చుట్టేశాయి. కొందరైతే అతడు పొరపాటు పడ్డాడా? లేదంటే న్యూజిలాండ్ను ఎగతాళి చేస్తున్నాడా? అని ప్రశ్నిస్తే, ఇంకొందరమే ‘మరీ అంతలా తాగాలా?’ అని కామెంట్స్తో విరుచుకుపడ్డారు.