కోవిడ్ కేసుల పెరుగుదలపై ఐసీఎంఆర్ ప్రకటన

ABN , First Publish Date - 2022-05-02T00:36:49+05:30 IST

కోవిడ్ కేసులు పెరుగుతుండటం, ఇది నాలుగో వేవ్‌కు సంకేతాలంటూ ఆందోళనలు...

కోవిడ్ కేసుల పెరుగుదలపై ఐసీఎంఆర్ ప్రకటన

న్యూఢిల్లీ: కోవిడ్ కేసులు పెరుగుతుండటం, ఇది నాలుగో వేవ్‌కు సంకేతాలంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అదనపు డైరెక్టర్ సమీరన్ పాండ కీలక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇండియాలో ప్రస్తుత కోవిడ్ కేసుల పెరుగుదలను నాలుగో వేవ్‌గా పరిగణించ రాదని చెప్పారు. ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, జిల్లాల స్థాయిల్లో కేసుల పెరుగుదల కనిపిస్తోందని, దాని ఆధారంగా యావద్దేశం నాలుగో దిశగా వెళ్తున్నట్టుగా చెప్పడం సరికాదని అన్నారు.


టెస్టింగ్ రేషియో ఆధారంగా కొన్ని లోకల్ స్థాయిల్లో కేసుల పెరుగుదలను గుర్తించామని పాండ చెప్పారు. దాని అర్ధం రాష్ట్రాలన్నీ కోవిడ్ గుప్పిట్లో ఉన్నట్టు కాదని అన్నారు. దేశవ్యాప్తంగా చూసినప్పుడు హాస్పిటల్ అడ్మిషన్లు పెరుగలేదని మరో కారణం చెప్పారు. అదీ కాకుండా, ఇంతవరకూ కొత్త వేరియంట్ ఏదీ గుర్తించనందున ఇప్పటికిప్పుడు నాలుగో వేవ్‌ వస్తుందనడానికి ఎలాంటి సంకేతాలు లేవని ఆయన వివరణ ఇచ్చారు. పాజిటివిటీ రేటుపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, పరీక్షలు తగ్గడం వల్ల పాజిటివిటీ రేటు ఒక్కోసారి పెరగవచ్చని అన్నారు.

Updated Date - 2022-05-02T00:36:49+05:30 IST