ఆ యుద్ధంలో... ఆలుగడ్డలతో విజయం సాధించిన అమెరికా

ABN , First Publish Date - 2020-09-11T22:16:48+05:30 IST

ఆలుగడ్డలతో రెండవ ప్రపంచ యుద్ధంలో... అగ్రరాజ్యం అమెరికా విజయం సాధించింది. ఆశ్చర్యంగా ఉన్నా... ఇది నిజం. వివరాలిలా ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు జరిగిందన్న విషయం తెలిసిందే. ఆ యుద్ధం జరుగుతోన్న సమయంలోనే... ఓ సబ్‌మెరైన్ లో ఉన్న అమెరికా సైన్యం... జపాన్ సైన్యం ఉనికిని గమనించింది. ఈ క్రమంలోనే ఆయుధాలను తీసే ప్రయత్నం చేసింది అమెరిా సైన్యం.

ఆ యుద్ధంలో... ఆలుగడ్డలతో విజయం సాధించిన అమెరికా

వాషింగ్టన్ : ఆలుగడ్డలతో రెండవ ప్రపంచ యుద్ధంలో... అగ్రరాజ్యం అమెరికా విజయం సాధించింది. ఆశ్చర్యంగా ఉన్నా... ఇది నిజం. వివరాలిలా ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు జరిగిందన్న విషయం తెలిసిందే. ఆ యుద్ధం జరుగుతోన్న సమయంలోనే... ఓ సబ్‌మెరైన్ లో ఉన్న అమెరికా సైన్యం... జపాన్ సైన్యం ఉనికిని గమనించింది. ఈ క్రమంలోనే ఆయుధాలను తీసే ప్రయత్నం చేసింది అమెరిా సైన్యం.


అయితే... ఆయుధాలను తీసేందుకు, వాటిని సన్నద్ధం చేసేందుకు, తాము సన్నద్ధమయ్యేందుకు ఎక్కు సమయం పడుతుందని, ఈ లోపే జపాన్ సైన్యం దాడి చేస్తుందని అమెరికా ఆందోళనకు గురైంది.


దీంతో... వెంటనే తాము ఆహారం కోసం తెచ్చుకున్న ఆలుగడ్డలను తీసుకుని జపాన్ సైన్యం మీదకు విసరడం ప్రారంభించారు. అవేమిటో అర్ధం కాకపోవడంతో జపాన్ సైన్యం ఒకింత ఆందోళనకు గురైంది. ఒక దశలో అవి బాంబులేమోనని భయపడింది కూడా. ఈ వ్యవధిలోనే అమెరికా సైన్యం ఆయుధాలు, అసలైన బాంబులతో దాడి ప్రారంభించింది. అలా ఆ యుద్ధంలో జపాన్‌పై... అమెరికా సైన్యం పైచేయిని సాధించింది. 

Updated Date - 2020-09-11T22:16:48+05:30 IST