మాజీ ఎంపీ గరికపాటి దాతృత్వం

ABN , First Publish Date - 2021-01-19T04:33:56+05:30 IST

మాజీ ఎంపీ గరికపాటి దాతృత్వం

మాజీ ఎంపీ గరికపాటి దాతృత్వం
అంబులెన్స్‌లను ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులు

ములుగు జిల్లాకు రెండు అంబులెన్స్‌ల వితరణ

ములుగుటౌన్‌, జనవరి 18: రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు ములుగు జిల్లాకు రెండు అంబులెన్స్‌లను అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో సోమవారం అంబులెన్స్‌లను ఎమ్మెల్యే ధనసరి సీతక్క, జడ్పీ చైర్మన్‌ జగదీశ్వర్‌లతో కలిసి మోహన్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మారుమూల గ్రామాల ప్రజలకు అంబులెన్స్‌లు అందించిన గరికపాటిని సీతక్క, జగదీశ్వర్‌ శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-01-19T04:33:56+05:30 IST