రోడ్డు ప్రమాద బాధితులకు టీడీపీ నేత సాయం

ABN , First Publish Date - 2022-08-15T00:16:39+05:30 IST

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి సాయం చేసి పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) మంచి మనసు చాటుకున్నారు.

రోడ్డు ప్రమాద బాధితులకు టీడీపీ నేత సాయం

జంగారెడ్డిగూడెం(ఏలూరు జిల్లా): రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి సాయం చేసి పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) మంచి మనసు చాటుకున్నారు. ఈ రోజు శ్రీనివాసులు టీ నర్సాపురం మండలం మక్కినవారిగూడెంలో ఒక ఫంక్షన్‌కు హాజరై తిరిగి బుట్టాయగూడెం బయలుదేరారు. జిలుగుమిల్లి దాటిన తరువాత బైక్ ప్రమాదం జరిగి రోడ్డు పక్కన తీవ్రగాయాలతో పడి ఉన్న ఇద్దరు క్షతగాత్రులను శ్రీనివాసులు చూశారు. వెంటనే అంబులెన్స్‌ (Ambulance)కు ఆయన సమాచారం అందించారు. శ్రీనివాసుల స్వయంగా బాధితులను అంబులెన్స్ ఎక్కించి.. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.



Updated Date - 2022-08-15T00:16:39+05:30 IST