అధిక సొమ్ము వసూలు చేస్తున్న అంబులెన్స్‌ సీజ్‌

ABN , First Publish Date - 2021-05-12T05:58:04+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా అధిక సొమ్ము వసూలు చేస్తున్న ప్రైవేటు అంబులెన్స్‌ను సీజ్‌ చేసినట్టు భీమవరం రవాణా శాఖ అధికారి టి.ఉమామహేశ్వరరావు తెలిపారు.

అధిక సొమ్ము వసూలు చేస్తున్న అంబులెన్స్‌ సీజ్‌

 భీమవరం క్రైం, మే 11:  నిబంధనలకు విరుద్ధంగా అధిక సొమ్ము వసూలు చేస్తున్న ప్రైవేటు అంబులెన్స్‌ను సీజ్‌ చేసినట్టు భీమవరం రవాణా శాఖ అధికారి టి.ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా మంగళవారం పలు అంబులెన్స్‌లను తనిఖీ  చేసినట్టు తెలిపారు. భీమవరం పట్టణానికి చెందిన ఏపీ 37 టీపీ 7288 అంబులెన్స్‌ నిర్వాహకుడు ఏలూరు ఆశ్రం ఆసుపత్రి నుంచి భీమవరానికి అధిక ఽసొమ్ము వసూలు చేస్తున్నాడని బాధితులు చెప్పడంతో ఉండి సెంటర్‌లో అంబులెన్స్‌ ఆపి కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్‌ చేసినట్లు రవాణాశాఖ అధికారి తెలిపారు. ఆయనతో పాటు మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు ఎస్‌. శ్రీనివాస్‌, గౌరీశంకర్‌, సిబ్బంది ఉన్నారు.


Updated Date - 2021-05-12T05:58:04+05:30 IST