‘108’ Ambulance‌లపై ఫిర్యాదులు

ABN , First Publish Date - 2022-01-27T17:04:32+05:30 IST

‘108’ అంబులెన్స్‌లపై వస్తున్న ఫిర్యాదుల విచారణకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుచేయాలని మద్రాసు హైకోర్టు

‘108’ Ambulance‌లపై ఫిర్యాదులు

విచారణకు ప్రత్యేక కమిషన్‌

చెన్నై/పెరంబూర్‌:  ‘108’ అంబులెన్స్‌లపై వస్తున్న ఫిర్యాదుల విచారణకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుచేయాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వు లు జారీచేసింది. ప్రమాదాల్లో గాయపడిన వారు, అత్యవసర చికిత్స  అవసరమైన వారి కోసం ప్రభుత్వం ‘108’ అంబులెన్స్‌ సర్వీసులు ఏర్పాటు చేసింది. కానీ, కొందరు అంబులెన్స్‌ డ్రైవర్లు, వైద్య సిబ్బంది  గాయపడిన వారిని ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తూ కమిషన్‌ తీసుకుంటున్నారని, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని మద్రాసు హైకోర్టులో ఓ ప్రజావ్యాజ్యం దాఖలైంది. దీనిని విచారించిన హైకోర్టు, 108 అంబులెన్స్‌లపై వస్తున్న ఆరోపణలు విచారిం చేందుకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుచేయాలని ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - 2022-01-27T17:04:32+05:30 IST