అంబేడ్కర్కు క్షీరాభిషేకం
ABN , First Publish Date - 2021-01-27T06:43:27+05:30 IST
అంకంపాలెంలో మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపుమేరకు రాజ్యాంగ పరిరక్షణదినాన్ని పార్టీశ్రేణులు ఘనంగా నిర్వహించారు.
ఆత్రేయపురం, జనవరి 26: అంకంపాలెంలో మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపుమేరకు రాజ్యాంగ పరిరక్షణదినాన్ని పార్టీశ్రేణులు ఘనంగా నిర్వహించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ విలువలు కాపాడడంతో పార్టీశ్రేణులు అంబేడ్కర్ విగ్రహాల వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ సర్పంచ్ కరుటూరి నరసింహారావు, కుదప కృష్ణమూర్తి, చిట్టూరి త్రినాథ్, కరుటూరి రామారావు, ముత్తాబత్తుల రాజు, నేకూరి శామ్యూల్, పీట్ల కృష్ణమూర్తి, రాచర్ల సురేష్ పాల్గొన్నారు.