అంబేద్కర్ విగ్రహం ధ్వంసం.. రోడ్లు దిగ్బంధించిన స్థానికులు
ABN , First Publish Date - 2021-12-12T21:35:06+05:30 IST
ఈ నిరసన సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై గంటపాటు కొనసాగడంతో పెద్ద ఎత్తున ట్రిఫిక్ నిలిచిపోయింది. ఓమలూట్ పట్టణ పోలీసులు నిరసనకారులతో చర్చించి.. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులను..
చెన్నై: తమిళనాడులోని సేలం జిల్లా ఓమలూర్ పట్టణంలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. శనివారం రాత్రి స్థానికుల కంట పడకుండా ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. దుండగుల దాడిలో అంబేద్కర్ విగ్రహం చేయి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఓమూల్ పట్టణ ప్రజలు ఆందోళనకారులను గుర్తించి, చర్యలు తీసుకోవాలంటూ నిరసనకు దిగారు. రోడ్లను దిగ్బంధించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
ఈ నిరసన సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై గంటపాటు కొనసాగడంతో పెద్ద ఎత్తున ట్రిఫిక్ నిలిచిపోయింది. ఓమలూట్ పట్టణ పోలీసులు నిరసనకారులతో చర్చించి.. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుని తొందరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో స్థానికులు నిరసన విరమించారు.