రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని అంబేద్కరే చెప్పారు: ఎంపీ వెంకటేష్ నేత

ABN , First Publish Date - 2022-02-03T22:19:27+05:30 IST

పాలించే పాలకులు సరిగా లేనపుడు రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని అంబేద్కరే

రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని అంబేద్కరే చెప్పారు: ఎంపీ వెంకటేష్ నేత

ఢిల్లీ: పాలించే పాలకులు సరిగా లేనపుడు రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని అంబేద్కరే చెప్పారని టీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. తాము కొత్త రాజ్యంగం కావాలన్నామన్నారు. కొత్త బట్టలు కావాలి అంటే పాతవి పడేయమని కాదని ఆయన పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయన్నారు. కొంత మంది బీజేపీ, కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా దీక్షలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చెప్పకుండా దీక్షలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బీజేపీ రాజ్యాంగంగా మారిందని ఆయన ఆరోపించారు. 

Updated Date - 2022-02-03T22:19:27+05:30 IST