14వరకు అంబేడ్కర్ జయంత్యుత్సవాలు
ABN , First Publish Date - 2021-04-17T05:18:25+05:30 IST
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవాలను వచ్చేనెల 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ ఐక్యవేదిక చైర్మన్ గుబ్బల రాంబాబు అన్నారు.
- ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ ఐక్యవేదిక చైర్మన్ రాంబాబు
రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్ 16: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవాలను వచ్చేనెల 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ ఐక్యవేదిక చైర్మన్ గుబ్బల రాంబాబు అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 14న రాజమ హేంద్రవరంలో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలి పారు. ఉద్యోగులు తోటి వారికి సాయపడడం, విద్యకు ప్రాధాన్యమివ్వడం, చదువుకునే వారికి సహకరించడం వంటి అంబేడ్కర్ తెలిపిన అంశాలను ఆస్క్, ఐక్యవేదికలు అమలు చేస్తున్నాయన్నారు. జయంత్యుత్సవాల్లో భాగంగా కబడ్డీ పోటీలు, రక్తదాన శిబిరం, యువతలో నాయకత్వ లక్షణాలపై అవగా హన శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు రాంబాబు తెలిపారు. సమావే శంలో కోకన్వీనర్లు వైరాల అప్పారావు, అజ్జరపు వాసు, చీరా రాజు, గొట్టిముక్కల అనంతరావు, కప్పల వెలుగు, గుడాల ఆదిలక్ష్మి, లాజర్ పాల్గొన్నారు.