నైతిక విలువలకు నిలువుటద్దం అంబటి

ABN , First Publish Date - 2021-04-22T06:57:51+05:30 IST

నైతిక విలువలకు, నీతి నిజాయి తీలకు మాజీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య నిలువుటద్దం వంటి వ్యక్తి అని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అన్నారు.

నైతిక విలువలకు నిలువుటద్దం అంబటి

 అవనిగ డ్డ టౌన్‌, ఏప్రిల్‌ 21 : నైతిక విలువలకు, నీతి నిజాయి తీలకు మాజీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య నిలువుటద్దం వంటి వ్యక్తి అని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అన్నారు. అంబటి బ్రాహ్మణయ్య వర్థంతిని అవనిగడ్డ వైసీపీ కార్యాలయం వద్ద బుధవారం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ నిరాడంబర జీవితం గడుపుతూ నిజాయితీతో  రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా   సేవలందించిన అంబటి బ్రాహ్మణయ్య స్ఫూర్తిప్రదాత అన్నారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. దివి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ కడవకొల్లు నరసింహారావు, సింహాద్రి వెంకటేశ్వరరావు, రేపల్లె శ్రీనివాసరావు, బీసాబత్తిన విజయలక్ష్మి, చింతలపూడి లక్ష్మినారాయణ, షేక్‌ నజీర్‌ పాషా  పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-22T06:57:51+05:30 IST