ముంపు గ్రామాల నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం ఇస్తాం: Ambati
ABN , First Publish Date - 2022-09-19T16:50:48+05:30 IST
పోలవరం(Polavaram) ముంపు గ్రామాలలో నిర్వాసితులకు ఎకరానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని హమీ ఇవ్వలేదని
Amaravathi : పోలవరం(Polavaram) ముంపు గ్రామాలలో నిర్వాసితులకు ఎకరానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని హమీ ఇవ్వలేదని మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) ఏపీ అసెంబ్లీ(AP Assembly)లో ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. నిజానికి ఒకటిన్నర లక్షలు గతంలో పరిహారం వచ్చిన వారికి మరో మూడున్నర లక్షలు ఇస్తామన్నారు. కేంద్రం ఎస్సీలకు ఒక రకంగా, ఎస్టీలకు ఒక రకంగానూ, బీసీలకు మరో రకంగా ఇస్తున్నారన్నారు. కేంద్రం 7 , 7న్నర లక్షలు ఇస్తే మిగిలిన 3 లేదా 2న్నర లక్షలు తమ ప్రభుత్వం ఇస్తుందని అంబటి రాంబాబు హమీ ఇచ్చారు.