భారత్ వైపు మొగ్గుతున్న విదేశీ కంపెనీలు.. భారతీ ఎయిర్టెల్లో అమెజాన్ పెట్టుబడులు
ABN , First Publish Date - 2020-06-04T23:01:11+05:30 IST
భారతీయ కంపెనీలపై విదేశీయులకు ప్రస్తుతం ఆసక్తి పెరుగుతోంది. అనేక దిగ్గజ వ్యాపార సంస్థలు...
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలపై విదేశీయులకు ప్రస్తుతం ఆసక్తి పెరుగుతోంది. అనేక దిగ్గజ వ్యాపార సంస్థలు ఇప్పుడు దేశంలోని అనేక సంస్థల్లో వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఇటీవలే రిలయన్స్ జియోలో ఫేస్బుక్ 9 శాతం పైగా వాటాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగ్గజ ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ అమెజాన్ కూడా ప్రస్తుతం ఓ ఇండియన్ కంపెనీలో వేలకోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్లో దాదాపు రూ.15వేల కోట్లకు పైగా అమెజాన్ పెట్టుబడులు పెట్టనుంది. దీనిద్వారా ఎయిర్టెల్ కంపెనీలో సుమారు 5 శాతం వాటా అమెజాన్ చేతికి వెళుతుంది. ఈ ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే రెండు యాజమాన్యాల మధ్య ప్రాథమిక చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.