అమరరాజా కంపెనీకి హైకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2021-05-06T18:04:05+05:30 IST
తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్ కంపెనీకి జగన్ సర్కార్ పెద్ద షాకిచ్చిన విషయం విదితమే
అమరావతి : తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్ కంపెనీకి జగన్ సర్కార్ పెద్ద షాకిచ్చిన విషయం విదితమే. ఈ ఆదేశాలను అమరరాజా కంపెనీ హైకోర్టులో సవాల్ చేయగా.. గురువారం నాడు కంపెనీకి ఊరట లభించింది. కంపెనీ మూసివేయాలని పీసీబీ ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. అంతేకాదు.. విద్యుత్ పునరుద్ధరణ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 17లోపు పీసీబీ సూచనలు అమలు చేయాలని ఆదేశించింది. మరోవైపు.. మళ్లీ రిపోర్ట్ ఫైల్ చేయాలని పీసీబీని కూడా హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 28కి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది.