Amarnath Yatraలో గల్లంతైన గునిశెట్టి సుధ మృతి
ABN , First Publish Date - 2022-07-12T00:51:24+05:30 IST
అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)లో వరదలో గల్లంతైన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గునిశెట్టి సుధ
రాజమహేంద్రవరం: అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)లో వరదలో గల్లంతైన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గునిశెట్టి సుధ(48) మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని శ్రీనగర్(Srinagar)లోని మార్చురీలో ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. అధికారులు ఆమె మృతదేహాన్ని ఢిల్లీ (Delhi) నుంచి విశాఖకు విమానంలో తరలించనున్నారు. సోమవారం రాత్రి 11.30గంటలకు చేరుతుందని కలెక్టర్ కె.మాధవీలత తెలిపారు. అక్కడ నుంచి ప్రత్యేక అంబులెన్స్లో రాజమహేంద్రవరంలోని ఆమె ఇంటికి తరలించనున్నారు. సుధ, ఆమె భర్త కిరణ్ ఇతరులతో కలసి అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. ఆమె వరదల్లో కొట్టుకునిపోగా, కిరణ్ క్షేమంగా బయటపడిన సంగతి తెలిసిందే. ఆమె మృతివార్త ఆమె కుటుంబంతోపాటు బంధువర్గంలో విషాదాన్ని నింపింది. గల్లంతైన మరో మహిళ కొత్త పార్వతి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.