Amarnath యాత్రలో చిక్కుకున్న కన్నడిగులు క్షేమం

ABN , First Publish Date - 2022-07-10T16:17:18+05:30 IST

జమ్మూకశ్మీర్‌ దక్షిణ ప్రాంతంలోని అమరనాథ్‌లో వంద మందికిపైగా కన్నడిగులు చిక్కుకున్నారని, వీరంతా సురక్షితంగా ఉన్నారని కర్ణాటక

Amarnath యాత్రలో చిక్కుకున్న కన్నడిగులు క్షేమం

                               - Cm Basavaraj Bommai


బెంగళూరు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): జమ్మూకశ్మీర్‌ దక్షిణ ప్రాంతంలోని అమరనాథ్‌లో వంద మందికిపైగా కన్నడిగులు చిక్కుకున్నారని, వీరంతా సురక్షితంగా ఉన్నారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వెల్లడించారు. బెంగళూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణా ప్రాధికార శుక్రవారం రాత్రి నుంచే సహాయ కార్యక్రమాల ప్రారంభించిందని, అందర్నీ సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సహాయం కోసం గత రాత్రి నుంచి ఇంత వరకు 20కు పైగా ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని, ఈ నేపథ్యంలో ప్రత్యేక సహాయవాణిని కూడా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ప్రాధికార అధికారులు అమరనాథ్‌లో చిక్కుకున్న కన్నడిగులందర్నీ సురక్షితంగా రప్పించేందుకు బీఎస్ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫతో నిరంతరం చర్చిస్తున్నామన్నారు. మైసూరు నగరం నుంచి అమరనాథ్‌ యాత్రకు వెళ్లిన 10 మంది న్యాయవాదుల బృందం కూడా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. తానే స్వయంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం అమరనాథ్‌కు బయల్దేరి వెళ్లిందన్నారు.

Updated Date - 2022-07-10T16:17:18+05:30 IST