Amarnath Yatra: నున్వాన్ నుంచి గుహకు బయలుదేరిన యాత్రికులు

ABN , First Publish Date - 2022-06-30T16:29:42+05:30 IST

బం బం భోలే నినాదాల మధ్య అమర్‌నాథ్ యాత్ర గురువారం రెండో రోజుకు చేరుకుంది....

Amarnath Yatra: నున్వాన్ నుంచి గుహకు బయలుదేరిన యాత్రికులు

జమ్మూ(జమ్మూకశ్మీర్): బం బం భోలే నినాదాల మధ్య అమర్‌నాథ్ యాత్ర గురువారం రెండో రోజుకు చేరుకుంది.గురువారం ఉదయం 2,750 మంది యాత్రికులు నున్వాన్ బేస్ క్యాంపు నుంచి అమరనాథ్ గుహ మందిరానికి బయలుదేరారు.అమర్‌నాథ్ యాత్ర మానవజాతి మంచితనంపై విశ్వాసాన్ని బలపరుస్తుందని, ఈ పవిత్ర యాత్రను విజయవంతంగా నిర్వహించడం కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రతి పౌరుని విధి అని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు.అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లోని నున్వాన్ బేస్ క్యాంపు వద్ద డిప్యూటీ కమిషనర్ పీయూష్ సింగ్లా పాదయాత్రను ప్రారంభించారు.మార్గంలో షీష్‌నాగ్, పంచతర్నిల వద్ద రాత్రిపూట యాత్రికుల హాల్ట్‌లతో ప్రయాణం మూడు రోజులు సాగనుంది. 


Updated Date - 2022-06-30T16:29:42+05:30 IST